జనసేనలో చేరిన కరీమ్ మేస్త్రి
మంగళగిరి: మంగళగిరి పట్టణంకు చెందిన తెలుగు దేశం పార్టీ మాజీ సీనియర్ నాయకులు, 29 వ వార్డు కు చెందిన కరీమ్ మేస్త్రి ఎం.టి.ఎం.సీ మైనార్టీ సెల్ కో ఆర్డినేటర్ షేక్ సుభాని ద్వారా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కండువా కప్పి, సాదరంగా జనసేన పార్టీలో ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆశయాలకు, విధానాలకు ఆకర్షితులు అయ్యి పార్టీలో కి వచ్చిన కరీం ను అభినందించడం జరిగింది. జనసేన పార్టీ ముస్లిం మైనార్టీలకు పెద్ద పీట వేస్తుంది. మైనార్టీల అభివృద్ధి జనసేన తోనే సాధ్యం అని అన్నారు. మీ అనుభవాలు జనసేన పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, ఎం.టి.ఎం.సీ నగర అధ్యక్షులు మునగపాటి మారుతి రావు, రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి జంజనం వెంకట సాంబ శివ రావు(జె.ఎస్.ఆర్), ఎం.టి.ఎం.సీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుభాని, మంగళగిరి పట్టణ జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, సీనియర్ నాయకులు నారాయణ, ఉమామహేశ్వరరావు, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, చంద్రశేఖర్, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-16-at-5.49.15-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-16-at-5.49.15-PM-1-1024x576.jpeg)