రోడ్ల సమస్యలపై గళమెత్తిన కరిమజ్జి మల్లీశ్వారరావు
#GoodMorningCMSir
పవనన్న ప్రజాబాట 84 వరోజు
శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం మెట్టవలస గ్రామం నుండి బోంతుపేట గ్రామం వరకు వెళ్ళే రోడ్లు చాలా అధ్వాన్నంగా తయారు అయ్యింది. ప్రజలకు కావలసిన మౌళిక సదుపాయాలు కల్పించకుండా మాటలు దాటవేస్తు రహదారులు దుస్థితిని పట్టించుకోని ప్రభుత్వం వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులు మరియు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు మరియు జనసేన పార్టీ నాయకులు కృష్ణాపురం పంచాయతీ యంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు మెట్టవలస గ్రామం జనసేన నాయకులు పిట్ట వేణు రోడ్లు సమస్యలపైన గళమెత్తారు. రోడ్లు సమస్యను పవన్ కళ్యాణ్ గారి దగ్గరకి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా చేరే విధంగా మరియు ఇప్పుడు ఉన్న వైసిపి ప్రభుత్వం మరియు గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదాలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. మాచుట్టు ప్రక్కల గ్రామాలకు ఆరోడ్డు పైన ప్రయాణించదానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పిల్లలు చాలా ఇక్కట్లు పడుతున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు అక్కడిక్కడే మధ్యలోనే డిలివరీ అయ్యే పరిస్ధితులు ఉన్నాయి. ఈ అన్యాయాన్ని జనసేన పార్టీ బలంగా ఎదుర్కొంటుంది. ఈ రోడ్లు సమస్యను ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు నిర్మాణాన్ని పూర్తి చేస్తారని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో గంగిరెడ్డి, శ్యామప్రసాద్, గౌరి నాయుడు, లీలాప్రసాద్, రమణ, అప్పలనాయుడు, జగ్గారావు, రామప్పడు, గోవిందరావు లక్ష్మణరావు, సీతారాం, ఆదిలక్ష్మీ, వరలక్ష్మీ, గౌరమ్మ, వనిత, నారాయణమ్మ, రాములమ్మ, గీత, రాధ, గీతిక, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-15-at-11.58.21-AM-1-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-15-at-11.58.21-AM-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-15-at-11.58.22-AM-1024x458.jpeg)