బండి పాలెం గ్రామ ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు భేటీ..!!
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మంగళవారం ఎచ్చెర్లనియోజకవర్గం రణస్థలం మండలం బండి పాలెం గ్రామ చేరువులో ప్రజలతో పవన్ రావాలి పాలనా మారాలి.. మార్పు కోసం ప్రజలను కలిసి ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం తప్పిదాలు ప్రజలకు తెలియజేస్తూ.. ఉప్పువలస గ్రామ ప్రజలకు ఈ సారి జనసేనకు అవకాశం ఇవ్వాలని అలాగే.. జనసేన పార్టీ సిద్దాంతాలను మరియు మేనిఫెస్టో గురించి చెబుతూ.. ఈ సారి జనసేన పార్టీ అధికారం లోనికి వచ్చిందంటే గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, తెల్లరేషన్ కార్డుకు ఇసుక ఫ్రీ గా.. ఇవ్వడం జరుగుతుందని.. రేషన్ బదులుగా మహిళల ఖాతాల్లో రూ”2500-3500/-వరకు నగదు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆదర్శాలను మరియు ఆచరించే విధానాలను ప్రజలకు కరిమజ్జి మల్లీశ్వారావు వివరించి.. టిడిపి. వైసీపీ ప్రభుత్వ పాలన చూశారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీ పాలన కూడా ప్రజలు చూడాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల వారికి మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు వంటి పవన్ కళ్యాణ్ గారికి, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని కరిమజ్జి మల్లీశ్వారావు మరియు పోట్నూరు లక్ష్మునాయుడు కోరడమైనది. ఈ కార్యక్రమంలో బండిపాలేం గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-10-at-2.35.57-PM-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-10-at-2.36.22-PM-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-10-at-2.36.22-PM-2-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-10-at-2.36.23-PM-1024x458.jpeg)