పిషిణి గ్రామ ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు భేటీ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం పిషిణి గ్రామంలో పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేనపార్టీ నాయకులు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు గారు జనసేన పార్టీ యంపీటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు శుక్రవారం ఉదయం చెరువులో ఉన్న ఉపాధి కూలీలతో మరియు ఆగ్రామంలో ప్రతి ఇంటి ఇంటికి కార్యక్రమంలో మేము ఆగ్రామాన్ని పర్యటించడం జరిగింది. చెరువులో ఉన్న ప్రతి ఒక్కరూను కలవడం జరిగింది. జనసేన పార్టీ సిద్దాంతాలు, మరియు మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం మరియు ప్రతి మహిళకు, యువతకు, పెద్దలకు, తెలియజేయడం జరిగింది పవనన్న ప్రజాబాట ఇంటి ఇంటికి ప్రజా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి 68 రోజులు పూర్తి చేసుకున్న పవనన్న ప్రజాబాట సుదీర్ఘంగా ప్రజలు దగ్గరకు వెళ్ళి పలు కుటుంబాలను పలకరిస్తూ ముందుకు సాగడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో బాగంగా 3000 మంది కౌలు రైతులు చనిపోయారని, వాళ్ల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. అలాంటి నాయకుడిని కాపాడు కోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పవనన్న ప్రజాబాట తాము ప్రారంభించిన ప్రజలనుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇద్దాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసిపి కి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు.
ఈ కార్యక్రమంలో పిషిణి గ్రామ,ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.