మహాపాదయాత్రలో పాల్గొన్న కాతేరు జనసేన

రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ కి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని తమ తమ భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న అమరావతి – అరసవిల్లి మహా పాదయాత్రలో భాగంగా రాజమండ్రిలో మంగళవారం, బుధవారం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో గత రెండు రోజులు రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ కమిటీ సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ లతో పాటు రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామం నుండి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, కార్యదర్శి జి. రాజేశ్వరి మరియు జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.