తమిళనాడు ప్రభుత్వానికి కేసీఆర్ కృతజ్ఞతలు

హైదరాబాద్ వరద బాధితుల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి రూ. 10 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం పళనిస్వామికి తమిళనాడు సర్కార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి బాసటగా నిలిచి వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రాష్ర్టానికి రూ. 10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా, బ్లాంకెట్లు, చద్దర్లతో పాటు ఇతర సామాగ్రి కూడా పంపుతామని ప్రకటిస్తూ.. ఎంతో ఉదారంగా ముందుకు వచ్చినందుకు సీఎం పళనిస్వామికి, తమిళనాడు ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో ముంపు బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరును సీఎం పళనిస్వామి ప్రశంసించారు. తెలంగాణకు రూ. 10 కోట్లు ప్రకటిస్తూ సీఎం కేసీఆర్‌కు తమిళనాడు సీఎం లేఖ రాశారు.