రోజా నోరు అదుపులో పెట్టుకో: కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం, టూరిజం శాఖామంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకో… ఆంధ్రప్రదేశ్ మీ తాత, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత అడ్డా కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అడ్డా అని తెలుసుకో నోటికి వచ్చినట్టు అవగాహన రాహిత్యంతో అవాక్కులు చవాక్కులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. మహిళలంటే మాకు గౌరవం ఉంది కానీ నువ్వు రాక్షస జాతికి చెందిన ఇడింబి, సూర్పనక రాక్షసుల లాంటి మహిళవు అని, నీమాటలు నీ ప్రవర్తన వల్ల మాకు అర్థమైంది. ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయాలనేది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులకు నిర్దేశిస్తారు. మీలాంటి అవగాహన రాహిత్యం లేని వ్యక్తులతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, నీవెంత? నీ బతుకు ఎంత? గతంలో చంద్రబాబునాయుడు బిస్కెట్లు ఇస్తే రాజశేఖర్ రెడ్డిని వారి కుటుంబాన్ని విమర్శించిన నోటితోనే… నేడు జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు వేస్తే పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నావు నీకు సిగ్గు అనిపించట్లేదా..? జనసేన పిల్లలు చిన్న పిల్లలు… సినిమా పిచ్చి పిల్లలు కాదు వచ్చే ఎన్నికల్లో నీ నియోజకవర్గంలో వారి సత్తా చూపిస్తారు నీకు దమ్ము ధైర్యం ఉంటే కాసుకో? తేల్చుకో? నీకు మగ మగతనం అంటే మక్కువ ఎక్కువ అనుకుంటా! అందుకే ఎదుటోళ్ల మగతనం గురించి మాట్లాడుతున్నావు. గన్ను కంటే జగనన్న ముందు వస్తాడని చెప్తావు కదా…! దమ్ము ధైర్యం ఉంటే సుగాలి ప్రీతి కేసుని నీవు మీ అన్న పరిష్కరించండి. పదవీ భ్రష్టులై మతిభ్రమించిన పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు దిగజాడు రాజకీయాలు చేస్తున్న నీలాంటి వారి మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు రోజా ఇప్పటికైనా మీరు తెలుసుకోండి. నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడు లేకపోతే నీ తాట తీస్తాం అని హెచ్చరిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.