42వ డివిజన్ లో కేశినేని వెంకట్ ప్రచారం

విజయవాడ: కేశినేని శివనాథ్ (చిన్ని) తనయుడు కేశినేని వెంకట్ సోమవారం 42వ డివిజన్ లో పర్యటించారు. జనసేన బిజెపి బలపరిచిన కూటమి టిడిపి పార్లమెంటు అభ్యర్థి గౌరవనీయులు కేశినేని శివనాథ్ (చిన్ని) గారిని సైకిల్ గుర్తు పైన.. టిడిపి జనసేన బలపరిచిన కూటమి బిజెపి అసెంబ్లీ అభ్యర్థి గౌరవనీయులైన యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అదేవిధంగా స్థానిక సమస్యలన్నిటిని కుటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ మాట్లాడుతూ మరొకసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాకట్టు పెట్టడానికి ఇంకా మన ఇల్లులు మాత్రమే ఉన్నాయి. అందుకని ఆలోచించి ఓట్లు వేయాలని చెప్పి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 42 వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష, టిడిపి అధ్యక్షులు శివాజీ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, పెద్ది సతీష్, షహీద్, అశోక్, సుభాని, కరీముల్లా, కోడెబోయిన స్రవంతి మరియు జనసేన టిడిపి బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.