ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు ఆమోదం తెలపడం, రూ.617 కోట్ల వ్యయంతో అసెంబ్లీ భవనం, రూ.786 కోట్లతో హైకోర్టు భవనం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్కు అప్పగించనున్నట్టు నిర్ణయించారు. అలాగే, స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ ఏర్పాటును ఆమోదించిన కేబినెట్, పట్టణాల్లో వరద నివారణ కోసం ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖ ఐటీహిల్-3 ప్రాంతంలో టీసీఎస్కు 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 3.5 ఎకరాలు కేటాయించడమే కాక, కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కూడా ఉరుస క్లస్టర్కు కేటాయించారు. అలాగే, బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద 30 మెగావాట్ల సామర్థ్యంతో హైడల్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఒడిశా పవర్ కన్సార్టియమ్కు అనుమతి ఇచ్చారు. జలవనరుల శాఖ ప్రతిపాదనలపై కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ నుంచి అనుమతులు లభించాయి. ఈ నిర్ణయాలన్నీ రాష్ట్రంలో శాశ్వత అభివృద్ధికి దారితీయనున్నట్లు స్పష్టమవుతోంది.
Share this content:
Post Comment