ప్రజాస్వామ్యాన్ని చంపేశారు!

  • జనసేన పార్టీ రూరల్ జిల్లా జాయింట్ సెక్రెటరీ కిల్లో రాజన్ ఎల్ ఎల్ బి

పాడేరు: సెర్చ్ వారంట్ లేకుండా మంగళగిరి కార్యాలయ సిబ్బంది రూమ్ లపై చొరబడటం అప్రజాస్వామ్యం, అనుమతి లేకుండా అక్రమంగా, గోడలు దూకి రూముల్లో ప్రవేశించడం లా అండ్ ఆర్డర్ ని అతిక్రమించడమేనని జనసేన పార్టీ రూరల్ జిల్లా జాయింట్ సెక్రెటరీ కిల్లో రాజన్ మండి పడ్డారు. శుక్రవారం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న అరాచకాలు రాష్టానికి రావణ కాష్టంగా మారిందని దుయ్యబట్టారు. రేపు మా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది అప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో చేసి చూపిస్తామని మండి పడ్డారు. కచ్చితంగా న్యాయ విచారణ జరిపి అక్రమంగా చొరబడి సిబ్బందిని బయబ్రాంతులకు గురి చేసిన ప్రభుత్వ గుండాల పై చర్యలు తీసుకోవాలి, చట్ట మంటే మీ బాబుగారి సొత్తు కాదని అన్నారు. నీకిష్టమైనట్టు లా అండ్ ఆర్డర్ ని చట్టాన్ని ఉపయోగిస్తే చూస్తూ ఊరుకోం, తప్పకుండా మీ దురాగతాలపై పోరాడుతం. మీరు చేస్తున్న ప్రతి దుర్చర్యకి ప్రతి పలం అనుభవిస్తారని హెచ్చరించారు. జనసేనానీ మీదే కాదు జనసేన కార్యాలయాపై ఇటువంటి, బెదిరింపుచర్యలకు పాల్పడితేఊరుకోం, రాష్ట్రంలోని ప్రతి ఇంటా జనసైనికుడు ఉన్నాడు, దేనికైనా తెగిస్తాం.. మా అధినేత పవన్ కల్యాణ్ గారికి అండ గాఉండి ప్రజలపక్షాన పోరాటానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.