వార్నింగ్ ఇచ్చినా మారని మంత్రి రోజాపై నిప్పులు చెరిగిన కిరణ్ రాయల్

  • సిగ్గుకే సిగ్గేస్తుంది సిగ్గులేని రోజా
  • ఈసారి మా జనసేనానిపై నోరు జారితే రోజా ముత్తాతల జాతకాలు బయట పెడతాం
  • రాజధానికి దిక్కులేదు ఐపీఎల్ అవసరమా రోజా
  • బాలీవుడ్ నటి సన్నీలియోన్ మాటను రోజా పాటిస్తుందా
  • శ్రీరెడ్డిని మించి రోజారెడ్డి సెగ
  • వార్నింగ్ ఇచ్చినా మారని మంత్రి రోజాపై నిప్పులు చెరిగిన జనసేన నేత కిరణ్ రాయల్

తిరుపతి: ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా రోజా సిగ్గుకే సిగ్గేస్తుంటే.. అన్నీ విడిచిన ఈ సిగ్గులేని రోజా తమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని పలుమార్లు విమర్శించడాన్ని జీర్ణించుకోలేని.. జనసేన పార్టీ నేతలు కిరణ్ రాయల్, ఆకేపాటీ సుభాషిని లు నిప్పులు చెరిగారు. తిరుపతి ప్రెస్క్లబ్లో బుధవారం మీడియా ముందు జనసేన నాయకులు హేమ కుమార్, కొండ రాజమోహన్ , వినోద్, దుర్గా, చందన తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ… అప్పుల ఊబిలో ఉన్న రోజా వైకాపా పంచన చేరి నేడు బెంగళూరు, చెన్నై తదితర నగరాలలో భవనాలను నిర్మిస్తూ , కోట్ల రూపాయల కారు లలో తిరగడం వేనక ఎంత ప్యాకేజీ తీసుకున్నావు రోజా అంటూ ప్రశ్నించారు. మా పవన్ పై విమర్శలు చేస్తూ వైసీపీ అధిష్టానం నుంచి బలమైన ప్యాకేజీలను వెనకేసుకుంటున్న రోజా ఓ పెద్ద ప్యాకేజి స్టార్ అంటూ దుయ్యబట్టారు. బాలీవుడ్ నటి సన్నీ లియో రోజా ను ఉద్దేశించి నేను ఆ ఆ వృత్తి నుండి బయటకు వచ్చేసా, నువ్వు ఇంకా రాలేదా రోజా అని విమర్శించిన మాట మరిచావా మంత్రి రోజా అంటూ హాస్య పూరితంగా గత నిజాలను గుర్తుచేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా ఐపీఎల్ నిర్వహించడం అవసరమా రోజా అంటూ .. ఐపిఎల్ బదులుగా (రోజా ఐపీఎల్) ఆర్పిఎల్ అని పెట్టుకో నీ గ్రౌండ్లో ప్లేయర్లు చాలకుంటే మా జనసేన సైనికుల్ని పంపు తామంటూ చురకలు విసిరారు. ఒక్కడే ఒంటరిగా సింహంలా మా జనసేనాని ఎక్కడికైనా వారాహిలో వస్తాడని, త్వరలో చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టనున్నాడని దమ్ముల గురించి మాట్లాడుతున్న ప్యాకేజీ స్టార్ రోజా వారాహి వాహనం ముందు దమ్ముల గురించి తెలుసుకుంటాం రా అని సవాల్ విసిరారు.