సీఎం రేసులో కిషన్ రెడ్డి.. మరి బండి సంజయ్ పరిస్థితి?

దుబ్బాకలో బీజేపీ ఘన విజయం, అదే విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇవ్వడంతో బీజేపీ ఇప్పుడు రాష్ట్రమంతా బలపడేలా వ్యూహాలు రచిస్తోంది. అదే విధంగా బండి సంజయ్ కు రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుల నుండి ఎక్కువ స్థాయిలో మద్దతు ఉండడం లేదనే మాట బలంగా వినిపిస్తోన్న సంగతి మనకు తెలిసిందే.

బండి సంజయ్ దూకుడు కొంత మంది నాయకులకు మింగుడు పడడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అందుకే బండి సంజయ్ వర్గాన్ని దెబ్బ తీయడమే లక్ష్యంగా, బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం గా కిషన్ రెడ్డి అవుతాడనే ప్రచారాన్ని, బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం గట్టిగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా కిషన్ రెడ్డి పాల్గొన్న ఓ సభలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణకు సీఎం కిషన్ రెడ్డి అవుతాడని బహిరంగంగానే వ్యాఖ్యానించడంతో, ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది. దీనిపై బీజేపీ నాయకులు ఏమీ స్పందించనప్పటికీ జరుగుతున్న పరిణామాలు ప్రజలను కొంత ఆలోచనలో పడేసే అవకాశాలు లేకపోలేదు. భవిష్యత్తులో బీజేపీ లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేటువంటిది వేచి చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *