కోరుకొండ మండల కమిటీ సమీక్షా సమావేశం
రాజానగరం నియోజకవర్గం, ఒక రాజకీయ పార్టీకి వెన్ను దన్ను అయిన మండల కమిటీ నిర్మాణంలో భాగంగా కోరుకొండ మండల కమిటీ సమీక్షా సమావేశం కోరుకొండ జనసేన పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ మరియు కోరుకొండ మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ బలమైన శక్తిగా మారాలంటే ఎలాంటి ప్రణాళిక ఉండాలి అనే విషయంపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-09-at-22.17.45.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-09-at-22.17.45-1.jpeg)