శృంగవరం యువతకు వాలీబాల్ కిట్ బహుకరించిన కోటన కోటి
మాడుగుల: యువత క్రీడల్లో రాణించాలని జనసేన పార్టీ మండల నాయకులు కుంచా అంజిబాబు సమకూర్చిన వాలీబాల్ కిట్ ను ఆదివారం శృంగవరం పంచాయితీకి చెందిన యువతకు కోటన కోటి చేతుల మీదుగ అందజేశారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ క్రీడలుపట్ల ఆసక్తిగల యువకులను ప్రోత్సహించడానికి ఇప్పటికే పలుగ్రామాల్లో జనసేన పార్టీ తరపున క్రీడాసామాగ్రిని పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు మజ్జిఈశ్వరరావు, రాజు, మహేష్, గోవింద (గొల్డ్), గణేష్, శ్రీను, మహేష్, గంగూనాయుడు, వరహాలరాజు, అశ్వనీకుమర్, సూర్య, గంగునాయుడు, సాయిదుర్గ, శృంగవారం జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-25-at-10.02.24-PM-1024x461.jpeg)