ప్రమాదానికి గురైన జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన కొఠారు ఆదిశేషు

దెందులూరు నియోజకవర్గం, తాళ్ళ గోకవరం జనసైనికుడు రుద్రపోని వెంకన్నబాబు తల్లిదండ్రులు సత్యనారాయణ, సత్యవతి లు గతవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి.. కొంత ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది. బుధవారం సత్యవతి గారు ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చారని తెలిసి రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మీ, కొఠారు ఆదిశేషు జనసైనికులతో కలిసి వెళ్ళి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మీ మాట్లాడుతూ.. జనసేన పార్టీ తరుపున ప్రతీ జనసైనికునికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పారు. కొఠారు ఆదిశేషు మాట్లాడుతూ ఏ ప్రమాదం జరిగిన జనసేన పార్టీ ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

ఈ పరామర్శకు రాష్ట్ర మత్స్యకార విభాగ వైస్ ఛైర్మన్ మోరు నాగరాజు, దెందులూరు నియోజకవర్గ ఐ.టి విభాగ కో-ఆర్డినేటర్ ఏనుగు రామకృష్ణ, దెందులూరు నియోజకవర్గ జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రేమ్ కుమార్, పెద్దిశెట్టి నాని, మట్టా రంగబాబు, తిరుపతి వాసు, పరసా వెంకటధర్మతేజ, పూజారి సీతారాం, నిమ్మన రవికుమార్, కోలా నాగు, తోలం రమేష్, కోలా సాంబ తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.