కొట్టు విజన్ డబ్బు పైనే: బొలిశెట్టి

తాడేపల్లిగూడెం: మంత్రి కొట్టు విజన్ అంతా డబ్బు చుట్టే తిరుగుతుందని, ఏ విధంగా డబ్బు సంపాదించాలో ఆలోచనల చుట్టూ తిరుగుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. తాడేపల్లిగూడెం లోని 15వ వార్డు సావిత్రి పేటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి చేరిక సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను మున్సిపల్ ఉన్న సమయంలో పట్టణ ప్రజలకు రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కావాలని స్థలం విషయంలో ఉన్న అడ్డంకులు తొలగించి ముందుకు తీసుకు వెళ్తే దాని ఏర్పాటుకు కాంట్రాక్టర్ తో బేరం కుదరక కొట్టు ముందుకు వెళ్ళనివ్వలేదన్నారు. తాము వస్తే రౌడీయిజం అని చెప్పుకుంటున్న మంత్రికి తాను చైర్మన్ గా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేశాను గుర్తులేదా అన్నారు. తాము రౌడీలను కాదని ప్రజల రక్షకులమని పేర్కొన్నారు. నిజంగా రాజకీయ రౌడీ మంత్రి అన్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ తోట గోపి ఆధ్వర్యంలో పత్యాల వెంకటేశ్వరరావు బ్రదర్స్, దూద్ భాష, పజ్జారి శ్రీనివాస్, మెరుగు రాజగోపాల్, వైసిపి సేవాదళ్ అధ్యక్షుడు దస్తగిరి, మల్లిక అబ్బాస్, గూడూరి శివప్రసాద్ లు జనసేన కండువా కప్పుకున్నారు.