వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అసెంబ్లీ ప్రాంగణంలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు జనసైనికులు తీవ్రంగా ఖండించారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు ప్రశ్నించే గొంతు ఏమైంది..? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దగ్గర నెలకు 50 కోట్లు తీసుకున్నట్లు ఆరోపించారు. అలాగే జనసైనికులని జనసైకోలుగా విమర్శించాడు. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ టౌన్ నాయకులు పోలిశెట్టి శివ, జనసేన పార్టీ కొవ్వూరు మండల అధ్యక్షులు సుంకర సత్తిబాబు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంగుమళ్ల స్వామి, జిల్లా నాయకులు జక్కల శీను, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అచ్యుతరాయుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మైగపుల బాలకృష్ణ, జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి కాపకాయల సతీష్, జనసేన పార్టీ కార్యదర్శి బొడసింగ్ రాంబాబు ఫిర్యాదు పత్రం కొవ్వూరు టౌన్ పరిధిలో ఉన్న డిఎస్పీ దేవా కుమార్ కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Share this content:
Post Comment