హైదరాబాద్ లో ఐపీఎల్ కు కేటీఆర్ డిమాండ్.. అజారుద్దీన్ మద్దతు

హైదరాబాద్ కు ఐపీఎల్ నిర్వహణకు అవకాశం ఇవ్వకపోవడంపై మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం విదితమే. ఈ మేరకు బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులకు ట్వీట్ చేశారు. దేశంలోనే అతి తక్కువ కరోనా కేసులు హైదరాబాద్ లో నమోదవుతున్నాయని.. కాబట్టి హైదరాబాద్ ను కూడా ఐపీఎల్ నిర్వహణకు వినియోగించుకోవాలని బీసీసీఐని ట్యాగ్ చేస్తూ మంత్రి కేటీఆర్ కోరాడు. తమ ప్రభుత్వం లీగ్ నిర్వహణకు సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సన్ రైజర్స్ టీం హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అభిమానుల కోసం కేటీఆర్ ఈ కోరిక కోరారు.

ఇక మంత్రి కేటీఆర్ అభ్యర్థనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ మద్దతు తెలిపారు. హైదరాబాద్ కు ఐపీఎల్ నిర్వహణకు అవకాశం ఇవ్వాలని కోరారు.