అగ్రి ఇన్నొవేషన్ హబ్ను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్ లో మరో హబ్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నొవేషన్ హబ్ను కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నిస్తోందని ఈ సందర్భాంగా కేటీఆర్ అన్నారు.
ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలు, రైతులు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు అగ్రిబిజినెస్ మెళకువలు నేర్చుకునేందుకు అగ్రి హబ్ గ్రంథాలయంగా ఉపయోగపడుతుందన్నారు. రూ.9 కోట్ల నాబార్డ్ సాయంతో 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. రోబోటిక్ విధానంలో కలుపు తీయడం, డ్రోన్ల ద్వారా పంటలో తెగుళ్లను గుర్తించడం వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. అగ్రిహబ్లో 14 స్టార్టప్ కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో T హబ్, V హబ్ లు అందుబాటులో ఉన్నాయి. లెటెస్ట్గా అగ్రి హబ్ వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.