గుంతలను పూడ్చిన కూకట్ పల్లి జనసేన నాయకులు
కూకట్ పల్లి, కెపిహెచ్బి రోడ్ లో గుంతల మయం కావడంతో అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదని అక్కడున్న స్థానిక ప్రజలే గుంతలు పూడ్చడం జరిగింది. ఇందులో కూకట్ పల్లి జనసేన పార్టీ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ తన సొంతంగా గుంతలను పూడ్చడం జరిగింది. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేస్తున్నారు. కెపిహెచ్బి కాలనీ టెంపుల్ బస్ స్టాప్ హౌసింగ్ బోర్డ్ నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది, ఇలాంటి సమయంలో వర్షాలు పడి మరింత గుంతలు పడుతున్నాయి, దాంతో పాటు ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువ అవుతుంది ఇకనైనా అధికారులు ఇలాంటి సమస్యలు లేకుండా చూడాలని జనసేన పార్టీ నాయకులు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-19-at-18.02.25-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-19-at-18.02.23-1024x768.jpeg)