సావిత్రీబాయి ఫూలేకు నివాళులర్పించిన కూకట్పల్లి జనసేన

కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కే.పి.హెచ్.బి కాలని 5 వ ఫేస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గం జనసేన కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయిన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రేమ కుమార్ మాట్లాడుతూ సావిత్రీబాయి ఫూలే తన జీవితాన్ని మహిళల హక్కులు మరియు విద్య కోసం అంకితం చేసింది అని, బాల్య వివాహాలు, సతిసహగమనం మరియు కుల వివక్ష వంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కూడా ఆమె పోరాడారు. ఆమె సంఘ సంస్కర్త, విద్యావేత్త మరియు మానవతావాదితో పాటు సమృద్ధిగా మరాఠీ రచయిత్రి అని అన్నారు. ఈ కార్యక్రమములో కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కో-ఆర్డినేటర్లు కొల్లా శంకర్, వేముల మహేష్ కలిగినిడి, ప్రసాద్, అంజి సత్యసాయి, అన్నపురెడ్డి వెంకటస్వామి, నామన బుల్లి రాజు, ఆవుల రంగబాబు, బండారు వెంకటేష్, వెంకటేశ్వరరావు, పులగం సుబ్బు, శేఖర్, కిరణ్, తోట మురళి, సంపత్ కుమార్, సిద్ధార్థ, బాబు తదితరులు పాల్గొన్నారు.