మైనింగ్ నిమిత్తం చట్టాలను తూట్లు పొడుస్తున్న కుంభ రవిబాబు: జనసేన మురళి
అనంతగిరి: కుంభ రవిబాబు మైనింగ్ నిమిత్తం చట్టాలను తూట్లు పొడుస్తున్నడని జనసేన మురళి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1997 సమతా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నిమ్మలపాడు మైనింగ్ జోలికి ఎవరు రాలేదు కానీ! కుంభ రవి బాబు ఎమ్మెల్యే అయిన తర్వాత అనూహ్యంగా ఏపీఎండిసి ద్వారా మైనింగ్ లీజు టెండర్ ప్రకటన జరిగింది. అప్పుడు కూడా ఆయన బినామీ అయినా దూరియా రుక్మిణి సన్ అఫ్ కాసప్పకి రవి బాబు టెండర్ కట్ట పెట్టారు. కానీ వివిధ కారణాలు వలన ప్రభుత్వాలు మారిపోయిన కారణంగా రవి బాబుకి రాజకీయ పలుకుబడి లేకపోవడం వలన ఆ యొక్క టెండరు ఆగిపోయింది. అని నిమ్మలపాడు పరిసర గ్రామ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరలా రవి బాబుకి ఎస్టి కమిషన్ చైర్మన్ పదవి రాగానే నిమ్మలపాడు కాల్ సెట్ మైనింగ్ ఏపీఎండిసి ద్వారా టెండర్ ప్రకటన చేయించి ఇప్పుడు కూడా ఆయన బినామీలు అయినా 1. దూరియా రుక్మిణి 2. రుబ్బ శంకర్రావు. కట్టబెట్టించుకున్నారు గానీ నిమ్మలపాడు కరకవలస రాళ్లగరువు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు న్యాయం జరగలేదు కనుక రవి బాబు గో బ్యాక్ ఏపీఎండి నినాదంతో గ్రామస్తులు ముందుకు వెళుతున్నట్టు తెలియజేస్తూ తెలియజేసి ఉన్నారు. అలాగే కుంభ రవి బాబు గారి తండ్రి కుంభకోటయ్య పేరు మీద బొర్రా పంచాయతీ డెక్కాపూరం గ్రామంలో సర్వేనెంబర్:4/2.4/3 మరియు 5 లొ 4.270 హెక్టార్స్ లో కాల్ సైట్ మైనింగ్ ను ఆయన కొన్ని వేల టన్నులు తీసుకు వ్యాపారం చేసి ఉన్నారు అని తెలుస్తుంది. పర్యావరణ అనుమతులు సరిగ్గా లేనందున ఆ యొక్క మైన్ నిలిచిపోయినట్లు తెలుస్తుంది ఇక్కడ కూడా రవి బాబు గారు గ్రామ పంచాయతీకి కనీసం రాయల్టీ కట్టలేదు అని తెలుస్తుంది. మరియు ఈ విధముగా ఆయన మైనింగ్ ద్వారా కోట్ల రూపాయలు ఆదాయం సంప్రదించినట్టు తెలుస్తుంది కానీ ఇక్కడ ప్రజలకు మాత్రం ఏమి అభివృద్ధి కూడా ఆయన చేయలేదు ఆయన గారు తండ్రి పేరు మీద ఉన్న మైనింగ్ ఆగిపోవడం వలన నిమ్మలపాడు మైనింగ్ మీద ఆయన కన్ను దృష్టి పడినట్టు ఇక్కడ ప్రజలు రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటున్నారు. నిమ్మలపాడు గ్రామ ప్రజలకు ఆయన చేయవలసింది చేయకుండా ఉండడం మూలమున అన్ని బయటకు వచ్చినట్టు రవిబాబు గో బ్యాక్ అంటూ నిమ్మలపాడు కరకవలస రాలగరువు ప్రజలు ఈయన గారిపై నిరసన తెలియజేస్తున్నారు. రవి బాబు గారు గిరిజన సలహా మండలి చైర్మన్ గా ఉన్నప్పుడు బాక్సైట్ ఫైల్ కూడా అతి త్వరగా వేగంగా ముందుకు వెళ్లినట్లు ఇక్కడ నాయకులు ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతున్నది. ఈయన గారు శృంగవరపుకోట పరిసర ప్రాంతంలో జిందాల్ కంపెనీకి భూమిని కూడా చూపించడం జరిగినది. ఈయన గారు పదవి పొందిన వెంటనే గిరిజన ప్రాంతంలో ఏదో ఒక మైనింగ్ ప్రాజెక్టు లు ముందుకు వస్తూనే ఉన్నాయని అరకు పరిసర ప్రాంత ప్రజలు నాయకులు మాట్లాడుకోవడం జరుగుతున్నది అని జనసేన మురళి తెలపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-12-at-9.58.54-PM-1024x473.jpeg)