జనసేనాని పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కుంచా అంజి

మాడుగుల నియోజకవర్గం, ఈనెల 15వ తారీఖున విశాఖపట్నం వస్తున్న రాష్ట్ర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ను ఉత్తరాంధ్ర జనసైనికులు అంతా తరలివచ్చి స్వాగతం పలకాలని, కే. కోటపాడు మండల జనసేన నాయకుల్ కుంచా అంజి గురువారం మధ్యాహ్నం స్థానిక విలేఖర్లకు తెలిపారు. ఈ సందర్భంగా అంజి మాట్లాడుతూ, అధినేత పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు అందరూ తరలి రావాలని కోరారు. అలాగే 16వ తేదీన జనవాణి కార్యక్రమం ఉంటుందని, జనసైనికులు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆయన ఎదుట తెలియపరచాలి అన్నారు. అలాగే మూడవ రోజు అయిన 17వ తారీఖున జనసేన కార్యకర్తల సమావేశం ఉంటుందని, అందరూ భారీగా తరలిరావాలని, అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన విజయవంతం చేయాలని జనసేన మండల నాయకులు కుంచా అంజి చెప్పారు.