నీట మునిగిన రజక కాలనీలో పర్యటించిన లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

  • జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా

అనంతపురం, ఒక మోస్తరు వర్షానికే అనంతపురం నియోజకవర్గంలో సోమనాథ్ నగర్ లోని రజక కాలనీ నీట మునిగింది. గత రెండు రోజులుగా కనీసం అధికారుల పర్యవేక్షణ లేకుండా కాలనీవాసులు అయోమయ దీన పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. జనసేన పార్టీ పర్యవేక్షణలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో నీట మునిగిన కాలనీవాసుల్ని పరామర్శించి, మీకు అండగా జనసేన పార్టీ ఉందని కాలనీవాసులలో మనోధైర్యాన్ని నింపి, మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని జనసేన పార్టీ ఆవశ్యకతను తెలియజేసి, కాలనీ వాసులకు భరోసా కల్పించడం జరిగింది. తక్షణమే అనంత నగర కార్పొరేషన్ అధికారులు స్పందించి ముంపు ప్రాంతానికి గురైన రజక కాలనీ వాసుల్ని ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, లాయర్ మధు, నగర కార్యదర్శిలు విశ్వనాధ్, రమణ, లాల్ స్వామి నగర సంయుక్త కార్యదర్శులు ఆకుల అశోక్ కార్యక్రమాల కమిటీ కార్యదర్శి సంతోష్ జనసేన నాయకులు పాలగిరి చరణ్, మెరుగు శ్రీనివాసులు, భవాని నగర్ మంజునాథ్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.