రెక్కీ నిర్వహించడం మరియు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన కుప్పం జనసేన

  • జనసేన అధ్యక్షులకు అదనపు భద్రత కల్పించాలి
  • జగనన్నకు చెబుదాం ఇక చాలు దిగిపొమ్మని.
  • మీడియా సమావేశంలో జనసేన నాయకులు

కుప్పం, శాంతిపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మా నాయకులు పవన్ కళ్యాణ్ పై ఈగ వాలినా ప్రభుత్వందే బాధ్యత అని ముక్త కంఠంతో హెచ్చరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అధ్యక్షుల వారికి వెంటనే అదనంగా భద్రత కల్పించాలని మనవి చెయడం జరిగింది. అలాగే ఈ చేతకాని రాష్ట్ర ప్రభుత్వం పాలసీలపై గొంతెత్తుతున్న జనసేన నాయకులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటుగా భావిస్తూ నాయకులు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ సమావేశంలో, జిల్లా కార్యదర్శి రామమూర్తి, సంయుక్త కార్యదర్శులు వేణు, రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి వామనమూర్తి, నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు నవీన్, సమన్వయకర్తలు అరుణ్, మండల అధ్యక్షులు అమీర్, కిషోర్, రామకుప్పం భాస్కర్, శ్రీకాంత్, గుడుపల్లి హంసగిరి జాన్, శాంతిపురం కె వి ప్రసాద్, శ్రీకాంత్, హరి, సంపత్, బాబు కుప్పం మణి పాల్గొనడం జరిగింది.