జనసేన కావలి పార్టీ ఆఫీస్ ను సందర్శించిన కూసంపూడి శ్రీనివాసులు

కావలి నియోజకవర్గం: జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ జనసేన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు త్వరలో ప్రారంభం కాబోతున్న కావలి నియోజకవర్గ పార్టీ ఆఫీస్ సందర్శించిన సంధర్భగా వారిని సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించిన కావలి జనసేన నాయకులు తదుపరి భోజన ఏర్పాట్లు చేశారు. శ్రీనివాస్, నాగబాబు మరియు జయప్రకాష్ నారాయణ గారికి కూడా అత్యంత ఆప్తులు మరియు లోకసత్తా పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూకట్పల్లి నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసిన వ్యక్తి. వీరు మాట్లాడుతూ పార్టీ ఆఫీస్ అన్ని విధాలా ఎంతో బాగుంది అని త్వరలో జరగబోయే వారాహి యాత్రలో పార్టీ అధ్యక్షులు గారు కూడా ఈ పార్టీ ఆఫీస్ ను సందరించే అవకాశం ఉన్నది అని చెప్పారు. పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ ఘనంగా నివహించుకుందాము అని ఇంఛార్జి అళహరి సుధాకర్ గారూ నాకు అత్యంత ఆప్తులు అని మీరు అందరూ కళ్యాణ్ గారు నియమించిన ఇంఛార్జి & సమన్వయకర్త సుధాకర్ కు నాయకుల అండదండలను అందిస్తూ, రాబోయే రోజుల్లో కాబోయే సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకుందాము అన్నారు. అతి త్వరలో మీ నియోజకవర్గం వారికి కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కలుస్తారని జనసేన- టీడీపీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కావలి నియోజకవర్గం కు పార్టీ తరుపున సుధాకర్ గారికి మీకు ఎప్పుడు అండదండలు ఉంటాయని నన్ను, నాతో పాటు వచ్చిన వారిని ఆదరించిన ప్రతీ ఒక్కరికీ ముఖ్యంగా సుధీర్, రుషికేశ్, శ్రీనాథ్, కృష్ణయ్య తదితర నాయకులకు ధన్యవాలు తెలిపారు. ఈ కార్యక్రమములో కావలి నియోజకవర్గ అధికార ప్రతినిధి మన్నేపల్లి రిషికేష్, రాయలసీమ జోన్ 1 కమిటీ సభ్యులు ఆలా శ్రీనాథ్, కావలి నియోజకవర్గ కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్, బెల్లంకొండ మస్తాన్, ఆగస్టీన్, గుంటపల్లి కిష్టయ్య, మంద శీను, పాణి, మనోజ్, నవీన్, మంగళగిరి శీను తదితరులు పాల్గొన్నారు.