రోడ్డుప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు కువైట్, నందలూరు జనసేన అండ

రాజంపేట నియోజకవర్గం: ఇటీవలి కాలంలో రాజంపేట నియోజకవర్గం ఊటుకూరు పంచాయితీలోని కొడిదెల తిరుపాలమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడడం జరిగింది. అదేవిధంగా తిరుపాలమ్మ నివాసానికి సమీపంలోని వేరే వ్యక్తి కూడా ఇదేవిధమైన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ కువైట్ సభ్యుడు బల్లేపల్లి శ్రీనివాస్, నందలూరు జనసేన నాయకుడు జనసేన పార్టీ కువైట్ సభ్యుడు కొట్టే శ్రీహరి దృష్టికి తీసుకురాగా, ఇరువురు నందలూరు జనసైనికుల సహకారం మరియు
జనసేన పార్టీ కువైట్ సభ్యుల సహకారంతో 50,000/ రూపాయల ఆర్ధిక మొత్తాన్ని జనసేన పార్టీ రాష్ట్రకార్యదర్శి మరియు రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ ముఖరంచాంద్ మరియు రాజంపేట జనసేన నాయకులు అతికారిదినేష్ మరియు జనసేనరాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి కీర్తన చేతుల మీదుగా జూన్ 15వ తేది గురువారం అందజేయడం జరుగుతుంది. ఇటువంటి మంచి సేవాకార్యక్రమానికి రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనవలసిందిగా జనసేన పార్టీ తరఫున ఒక ప్రకటన లో మనవి చేసారు.