ములకలపల్లి జనసేన ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలంలో మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో హమాలీ కార్మికులకు జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసులో చాయ్ వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ మాట్లాడుతూ నిరంతరం శ్రమించే కార్మికులకు కష్టజీవులైనటువంటి ప్రతి ఒక్కరికి మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేది గాజు గ్లాస్ లోని చాయ్ పేద బీద కార్మికులకు మధ్య తరగతికి కుటుంబాలకు అందుబాటులో ఉండే గాజు గ్లాస్ ను జనసేన పార్టీ సింబల్ గా జనసేన పార్టీ మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగిందని, నిరంతరం శ్రమించే కష్టజీవులకు కార్మిక సంఘాలకు పేద బీద కుటుంబాలకు జనసేన పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ సెక్రెటరీ గరికే రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి పొడిచేటి చిన్నారావు, కార్యదర్శి బాధావత్ రవికుమార్, సహాయ కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు, మండల ముస్లిం మైనారిటీ అధ్యక్షులు ఎస్ కే జాన్ పాషా, పొగళ్లపల్లి నాయకులు కనుమల రాము, ములకలపల్లి గ్రామ కమిటీ నాయకులు సుద్దాల రమేష్, గోపగాని సాయి ప్రకాష్, కొత్తపల్లి శ్రీను, కమలాపురం గ్రామ కమిటీ నాయకులు మచ్చ శ్రీను, సుబ్బనపల్లి గ్రామ కమిటీ నాయకులు నక్కన రమేష్, రింగిరెడ్డిపల్లి గ్రామ కమిటీ నాయకులు నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.