కంచిలి మండల జనసేన ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు

కంచిలి: కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కంచిలి మండలం, బూరగాం గ్రామంలో జనసేన జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు రాష్ట్ర నాయకులు తిప్పన దుర్యోధన రెడ్డి, బైపల్లి ఈశ్వరరావు, నాగుల హరిబెహారా, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. మరియు జెడ్పిటిసి అభ్యర్థి డొక్కరి ఈశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. తదుపరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గ్రామంలో ఐదు మంది నిరుపేద వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. తదుపరి కొన్ని రోజుల క్రితం రోడ్డు యాక్సిడెంట్ కి గురైన డ్రైవర్ శివను పరామర్శించి రూ.3000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. తదుపరి చలివేంద్రం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ఇచ్చాపురం నియోజకవర్గం నాయకులు, వీరమహిళలు పాల్గొని విజయవంతం చేశారు.