ఉప్పుకాలవపై బ్రిడ్జిని పరిశీలించిన సర్వేపల్లి జనసేన నాయకులు

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, తిరుమలమ్మపాలెం పంచాయతీ నందు అదివారం ఉప్పుకాలవపై బ్రిడ్జిని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ తిరుమలమ్మపాలెం ఉప్పుకాలువపై హై లెవెల్ వంతెనకి మోక్షం ఎప్పుడు కలుగుతుందో. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు వస్తున్నారు, పోతున్నారు. వరదలు వస్తున్నాయి, రాకపోకలు ఆగిపోతున్నాయి. కానీ వరదలు సమయాలలో తిరుమలమ్మపాలెం గ్రామ ప్రజలు పడే అవస్థలు, ఇబ్బందులు, వారి కష్టాలు నాయకులకు పట్టవు. ఎనిమిది నెలలు అయింది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రూ.13 కోట్ల రూపాయల నిధులతో హై లెవెల్ వంతెన నిర్మాణం చేస్తా అని చెప్పి ఇప్పటివరకు కనీసం శిలాఫలకం వేసిన పరిస్థితి కూడా లేదు. గత ప్రభుత్వంలో శిలాఫలకం వేశారు. రూ.తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మిస్తామని చెప్పారు. మరి ఆ తొమ్మిది కోట్ల ఎటు పోయినాయి. ఆ శిలాపాలకం ఎటు పోయిందో తెలీదు. మళ్ళీ ఈయన రూ.13 కోట్ల రూపాయలతో నిర్మిస్తామని చెప్పాడు. కనీసం శిలాఫలకం కూడా వేసిన దాఖలాలు లేవు. ఈయన వాగ్దానాలు, మాటలు గారడి ఎలా ఉందంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి. వాగ్దానాలు, మాటలకి తప్ప చేతల్లో చేసే పరిస్థితి లేదు. తిరుమలమ్మపాలెం గ్రామానికి కలగా ఉన్న హై లెవెల్ వంతెన నిర్మాణం ఒక జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరుగుతుంది. వీళ్ళు ఎవరు కూడా చేయరు. ఇకనైనా కళ్ళు తెరవండి తిరుమలమ్మపాలెం గ్రామ ప్రజలారా అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీహరి, విజయ్, శ్యాంసుందర్, సుమంత్, విజయకుమార్, సుమన్, వెంకటేష్, వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.