టెన్త్ ఫలితాల్లో టాపర్ గా నిలచిన లక్ష్మీ శ్రావణి కి జనసేన సహాయం

విశాఖపట్నం, 97 వార్డ్, పెందుర్తి నియోజకవర్గం, 2021-22 సంవత్సర 10వ తరగతి ఫలితాల్లో మండల టాపర్ గా 583 మార్కులు సాధించిన బండారు లక్ష్మీ శ్రావణి ని అభినందించడంతోపాటు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ నాయకులు గొన్నాబత్తుల రాజు5000/- ఆర్ధిక సాయం, బుక్స్ ఇవ్వడం జరిగింది. పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు జనార్ధన శ్రీకాంత్ వబ్బిన మాట్లాడుతూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మీకు కెరియర్ గైడెన్స్ లో గాని.. చదువుకోవడంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెందుర్తి జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇవ్వడంతో పాటు ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించిన నరేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పడం జరిగింది. దాత గొన్నాబత్తుల రాజు మాట్లాడుతూ మీలాంటివారు సమాజానికి అవసరమని బాగా చదువుకొని మీ యొక్క కళ సివిల్ సర్వీస్ లో ఉద్యోగాన్ని సంపాదించాలని రేపు మీకు ఉన్న స్థాయి వచ్చిన తర్వాత మీరు కూడా ఇదే విధంగా కొంతమందిని ఆదుకోవాలని కొరారు. టాపర్ గా నిలిచిన బండారు లక్ష్మీ శ్రావణి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరియు నాకు ఈ సహకారాలు అందించిన జనసేన పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు.. ఆపదలో నన్ను ఆదుకున్నందుకు చాలా సంతోషమని, నా తండ్రి గారు చాలా కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారని.. తప్పకుండా వారికి సమాజానికి మంచి పేరు తెచ్చేదాకా నేను చదువుకుంటానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మెండా సతీష్, వీర మహిళ లత, నరేంద్ర
పాల్గొన్నారు.