జనసేనలోకి మత్స్యకారులు, దళితుల భారీ చేరికలు
డా. బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలంలోని సామంతకుర్రు గ్రామానికి చెందిన మత్స్యకారులు, దళితలు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీలో చేరారు. మత్స్యకార నాయకులు కొపనాతి ఏసు ఆధ్వర్యంలో మండల జనసేన పార్టీ నాయకులు పోలిశెట్టి బాబులు, జనసేన ఎంపీటీసి తిక్కా శేషుబాబు, డి.రావులపాలెం సర్పంచ్ ఉండ్రు భగవాన్ దాస్ జనసేనలో చేరిన వారికీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. వీరితో పాటు అమలాపురం నియోజకవర్గ క్రియాశీలక నాయకులు నల్లా శ్రీధర్, అమలాపురం పురపాలక మాజీ చైర్మన్ యాళ్ళ సతీష్, దళిత నాయకులుఇసుకపట్ల రఘుబాబు,అయితా బత్తుల ఉమామహేశ్వరరావు, కంచిపల్లి అబ్బులు, పురపాలక ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, కౌన్సిలర్లు పడాల శ్రీదేవి నానాజీ, తిక్కా సత్య లక్ష్మి ప్రసాద్, లింగోలు పండు, పోలిశెట్టి చిన్ని, చేట్ల మంగతాయారు, కొప్పుల నాగ మానస, బట్టు పండు, వాకపల్లి వేంకటేశ్వర రావు, కడియం సందీప్, యాళ్ళ బిందాస్, తిక్కా సరస్వతి మరియు అల్లవరం మండల నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-4.21.19-PM-1024x580.jpeg)