అధినేత నిర్ణయమే శిరోధార్యం: ఏపీ శివయ్య

  • జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య

చిత్తూరు: మన రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధిని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉద్దేశంతో గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పొత్తు నిర్ణయాన్ని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గము, మండల అధ్యక్షులు, మండల కమిటీ కార్యవర్గ సభ్యులు మరియు జనసైనికులు ఆమోదిస్తారని ఏపీ శివయ్య పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధినేత ఏ కార్యచరణ చేయమని ఆదేశించినా మేమందరము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సిద్ధమని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వము పరిపాలన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కొనసాగించడాన్ని ఆయన ఖండించారు. అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఏపీ శివయ్య పేర్కొన్నారు.