మోడల్ స్కూల్ ను సందర్శించిన హుస్నాబాద్ జనసేన నాయకులు

హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ను జనసేన పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాద్యాయులు, విద్యార్ధులు పలు సమస్యలను జనసేన నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. స్కూల్ కి వెళ్ళే దారిలో సిమెంటు రోడ్లు, లైటింగ్ మరియు వంటగది లాంటి నెలకొన్న తదితర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్, నాయకులు పొడి శెట్టి విజయ్, చెల్పూరి వినోద్ మొలుగూరి అరవింద్, జగదీష్, సంతోష్, హిమవంత్ తదితరులు పాల్గొన్నారు.