నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు అందజేసిన జనసేన నాయకులు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో ఈ మధ్య పలుమార్లు సంభవించిన వర్షాల కారణంగా ఉపాధి లేక ఇబ్బందులలో ఉన్న కొన్ని కుటుంబాలని పరామర్శించి నియోజకవర్గ ఇంచార్జ్ మేడా గురుదత్ ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ చేతుల మీదుగా స్థానిక మండల ఇంచార్జ్ కరిచర్ల విజయ్ శంకర్, దుబాయ్ శీను ఆధ్వర్యంలో వారికి ధైర్యం చెప్పి పార్టీ తరపున అన్నివిధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కండికట్ల అరుణ కుమారి, కేతా సత్యనారాయణ, చిడిపి నగేష్, అప్పాయమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు.