వెల్దుర్తి మండలం ఎమ్మార్వోని కలిసిన జనసేన నాయకులు

జనసేన పార్టీ నాయకులు సి జి రాజశేఖర్ మాట్లాడుతూ క్రిష్ణగిరి మండలం అలివేలి గ్రామానికి చెందిన బోయ సాలమ్మ.. భర్త బోయ మద్దిలేటి… వీరికి గవర్నమెంట్ నుంచి వైస్సార్సీపీ ఇంటి పట్టా హోసింగ్ శాంక్షన్ ఆర్డర్ లిస్ట్ వచ్చింది… లేఔట్ ఐ.డి .. బెనిఫీసియర్ ఐ.డి వచ్చినప్పటికి.. ఇప్పటి వరకు ఇంటి పట్టా ఇవ్వలేదు.. ఇదే విషయాన్ని సాలమ్మ కుమారుడు పులి శేఖర్ వి.ఆర్.ఓ ని అడిగితే మీరు 2019 పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున సర్పంచు అభ్యర్థిగా పోటీ చేయడం వల్ల అందుకు మీ గ్రామం వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ బోయ సాలమ్మకు ఇంటి పట్టా ఇవ్వొద్దని. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో.. అని అంటున్నారు.. అని ఈ సమస్య మా దృష్టికి తీసుకురావడం జరిగింది.

ఈ విషయం మీద మండల ఎం.ఆర్.ఓ ని కలిసి బోయ సాలమ్మ కుమారుడు పులి శేఖర్ ఇంతక ముందు అనేకసార్లు మా ఇంటి పట్టా మాకు ఇవ్వండి సార్ అని అనేకసార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది… అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడం వల్ల…!! జనసేన దృష్టికి తీసుకు రావడం వల్ల శనివారం ఎమ్మార్వో ని కలిసి సోమవారం లోపల ఇంటి పట్టా ఇస్తే ఓకే.. లేదంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందర ధర్నా చేస్తామని తెలియజేయడం జరిగింది. కులం చూడం.. మతం చూడం.. పార్టీలు చూడం.. అన్న వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఒక సర్పంచ్ గా పోటీ చేసినందుకే ఇంతలా ఎందుకు భయపడుతున్నారో అర్థం అవుతుంది. ఈ వైఎస్ఆర్సిపి తాటాకు చప్పళ్లకు ఇక్కడ ఎవరూ భయపడరనే విషయం గ్రహించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, సీజీ రాజశేఖర్, బోయ గోవిందు, టీ పులి శేఖర్, ఈ చిరంజీవి గౌడు, బి తిరుపాల్, సి నాగేశ్వరరావు, ఎన్ బాబ్జి, రాకేష్, సౌఖత్, నరసింహుడు మరియు తదితరులు పాల్గొన్నారు.