పోతుల రామారావుని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

అవినీతికి ఆక్సిజన్ అందకుండా చేస్తా, ప్రజల అభివృద్ధి కోసం నిజాయితీని నియోజకవర్గం మొత్తం వ్యాపించేలా చేస్తా అంటున్న కనపర్తి మనోజ్ కుమార్

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, టంగుటూరు మండలంలో శనివారం మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు పోతుల రామారావు గారిని మర్యాదపూర్వకంగా వారి నివాసం వద్ద కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కలిసారు. కొండపి నియోజకవర్గంలో ముఖ్యంగా టంగుటూరు మండలంలో రాజకీయ పరిస్థితులు, రాజకీయ అనుభవాలు, విధివిధానాలు, అభివృద్ధి మరియు అవినీతి నాయకుల పనితీరు, సూచనలు సలహాలు దిశా నిర్దేశం చేస్తూ ముఖ్యమైన అంశాలను పోతుల రామారావు జనసేన పార్టీ నాయకులకు తెలియజేశారు. కొండపి నియోజకవర్గంలో అవినీతిని ఎండకడుతూ, అవినీతికి ఆక్సిజన్ అందకుండా చేసి, నిజాయితీని నియోజకవర్గం మొత్తం వ్యాపింపచేస్తూ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తాము, ప్రజలను ఇబ్బంది పెడుతూ అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరి అవినీతి చిట్టా అధికారుల ముందు పెట్టి శిక్షపడే విధంగా చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐయినాబత్తిన రాజేష్(సింగరాయకొండ), గూడా శశిభూషణ్(జరుగుమల్లి), సయ్యద్ కాజా హుస్సేన్, అత్యల సురేష్ బాబు(టంగుటూరు), లింగంగుంట చంద్రవాస్(టంగుటూరు), బడుగు నాగార్జున, నూతలపాటి సురేష్, అవినాష్ లు పాల్గొన్నారు.