పోతిన మహేష్ పై ధ్వజమెత్తిన పశ్చిమ జనసేన నాయకులు

విజయవాడ, జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనూష ఆదేశాలతో జనసేన నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో పిచ్చికుక్క కరిసిన వారిలాగా మాట్లాడుతున్న పోతిన మహేష్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి జనసేన పార్టీ నాయకుల మీద, జనసేన పార్టీ మీద విషం కక్కుతున్న పోతిన మహేష్ నీకు ఒకటే చెబుతున్నా…. ముందు నువ్వు నోరు అదుపులో పెట్టుకో నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసుకో… నీ పార్టీలో నీ పరిస్థితి ఏంటో చూసుకో… బుడమేరు వరదలు వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ కారు రాలేదని పిచ్చివాడు వాగుతున్నావ్… ఆయన వస్తే ప్రజలకు జరిగే సహాయక చర్యల్లో ఇబ్బందులు కలుగుతాయేమోనని ఆయన రాలేదు…. ఆయన రాకపోయినా ప్రభుత్వ అధికారులందరూ సహాయక చర్యలలో నిమగ్నమైన, జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు వారి సొంత నిధులతో ఎన్నో విధాలుగా ప్రజలకు సహాయం చేశారో చూసుకో ఒకసారి…. ఇదిగో చూడు వైజాగ్ నుంచి, పి గన్నవరం నుంచి మరియు మా మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఇంక అనేకమంది ఎన్నారైలు ఇలా ఎంతోమంది పనిచేసారో చూసుకో… మీలాగా వరదలు తగ్గిపోయాక నాలుగు బ్రెడ్ ప్యాకెట్లు, నాలుగు పాల ప్యాకెట్లు పంచి ఫోటోలు దిగటం అనుకున్నావా జనసేన పార్టీ నాయకులు అంటే….? అసలు ఈ బుడమేరు వరదలు రావడానికి కారణం గత ప్రభుత్వంలో మీ వైయస్సార్సీపి పార్టీ నాయకుల భూకబ్జాలే ప్రధమ కారణం ఇది గ్రహించు. వరదలు వచ్చినప్పుడు మీ నాయకుడు వచ్చి ఒక నవ్వు నవ్వి కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు. అది ఎవరికి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారో ఒకసారి తెలపండి. మా నాయకుడు దాదాపు 400 పంచాయతీలుకి పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున అదే విధంగా పక్క రాష్ట్రంలో కోటి రూపాయలు సొంత నిధులు ఇచ్చిన మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి గురించి నువ్వా విమర్శించేది. నీ స్థాయి నువ్వు తెలుసుకుని మాట్లాడాలని జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీ వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి నిలబెట్టగలిగిందా….? అప్పుడు నిలబడిన అభ్యర్థికి మా జనసేన పార్టీ మద్దతు పలికింది ఈ విషయం నీకు తెలుసా అప్పుడు నువ్వు కూడా జనసేన పార్టీలోనే ఉన్నావుగా… మళ్లీ ఇప్పుడు మా కూటమి తరుపున చదువుకున్న మంచి వ్యక్తి, ఆలపాటి రాజా ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెడితే మీ కేసుల నాయకుడుని విత్‌డ్రా చేయిచారు. ఈ విషయం నీకు తెలుసా….? అంటే మీ వైఎస్ఆర్ సీపీ పార్టీ కి ఓట్లు అడిగే అర్హత ఉందొ అర్థం అయ్యిందిగా మీకు. మరొకసారి చెప్తున్నాము జనసేన పార్టీ గురించి గానీ జనసేన పార్టీ నాయకుల గురించి గానీ మీరు మాట్లాడితే ఇక సహించేది లేదని మీడియా ముఖంగా తెలియజేస్తున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 56వ డివిజన్ జనసేన పార్టీ సమన్వయకర్త ముద్రబోయిన దేవకి, పశ్చిమ నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ మమతాపురం రాజేష్, 48వ డివిజన్ ప్రధాన కార్యదర్శి దాసిన జగదీష్, 42వ డివిజన్ నాయకులు దాసరి బుజ్జి, అర్జ మార్కండేయులు, శ్రీనివాసులు, విజయ్, అయ్యాజ్, తదితరులు పాల్గొన్నారు

Share this content:

Post Comment