జనసైనికునికి భరోసా ఇచ్చిన రాజాం జనసేన నాయకులు

రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎన్ని రాజు వంగర మండలంలో పలు గ్రామాల్లో పర్యటన చేయటం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా కొప్పరవలస గ్రామంలో ఉన్న 4 వినాయక విగ్రహాలను దర్శించుకున్నారు. ఆ తరువాత ఈ మధ్యనే రాజాం బైక్ ర్యాలీలో ప్రమాదం జరిగి బాధపడుతున్న జనసైనికుడు అప్పల నాయుడును పరామర్శించి మేము ఉన్నాం అని ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చారు. రుషింగి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడు మహేష్ వాళ్ళ తండ్రిని మరియు ఈ మధ్యనే తోటి జనసైనికుడు దేవి ప్రసాద్ వాళ్ళ తండ్రి చనిపోయినట్లు తెలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అలాగే కొప్పరవలస, రుషింగి గ్రామాల్లో ఉన్న పెద్దలను, నాయకులను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.