పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎస్ కోట జనసేన నాయకులు

ఎస్ కోట, జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం చేయాలని జనసేన సీనియర్ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు జనసైనికులకు పిలుపునివ్వడం జరిగింది. 15న తేదీ శనివారము మధ్యాహ్నము 2గంటలకు 200 బైకులతో ఎస్ కోట నుండి విశాఖ ఎయిర్పోర్ట్ కి జనసైనికులు, వీరమహిళలు బయలుదేరి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం చెపుతామన్నారు. నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ మాట్లాడుతూ జనసేన జనవాణి కార్యక్రమానికి నియోజకవర్గ సమస్యలను, పోలవరం ఎడమకలువ, జిందాల్ నిర్వాసితుల సమస్యలు పవన్ కళ్యాణ్ కి నివేదిస్తారు. 17న మధ్యాహ్నం విజయనగరం జిల్లా నాయకుల కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం బీచ్ రోడ్డులో హోటల్లో నిర్వహించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమములో జనసేన మండల నాయకులు కొత్యడ రామకోటి భాస్కరరావు చంటి చిన్ని సురేష్ రాజు ఏర్టెల్ సతీష్ రొంగలి ఏర్నిబాబు రాజు తదితరులు పాల్గొన్నారు.