పురందేశ్వరిని కలిసిన తిరుపతి జనసేన నాయకులు

చిత్తూరు, ఏపి బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలో బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన పురందేశ్వరితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం చిత్తూరు జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జిల్లాలో వైసీపీ పాలనకు సంబంధించిన పలు అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, ఉమ్మడి చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న రాయల్, రాజేష్ యాదవ్, జిల్లా కార్యదర్శులు ఆనంద్, దేవర మనోహర్, కలప రవి, సంయుక్త కార్యదర్శి బీగల అరుణ, నగర ఉపాధ్యక్షులు బాబ్జీ, పార్ధు, లక్ష్మి, కొండా రాజా మోహన్, నగర ప్రధాన కార్యదర్శి, రుద్ర కిషోర్, నగర కారుదర్శులు కిరణ్ కుమార్, రవి, పురుషోత్తం రాయల్, హేమంత్, ఐటీ కో ఆర్డినేటర్ పార్థసారథి, సీనియర్ నాయకులు తోట జయంతి, రాజేష్ ఆచారి, రమేష్, గోపి, వంశీ,తిరుపతి అర్బన్ నాయకులు జనసేన సాయి, తిరుపతి రూరల్ నాయకులు రాంబాబు, మనోజ్ కుమార్, గౌస్ బాషా, వీరామహిళలు మధులత, శిరీష, దుర్గ, చందన, జనసైనికులు మోహిత్, బాలాజీ, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.