జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించిన నాయకులు

తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో కాకినాడ ముత్తా గోపాలక్రిష్ణ క్లబ్ జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ ల సమావేశం ఏర్పాటు చేసి జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్, కాకినాడ రూరల్ ఇంచార్జ్, మరియు ఫాఛ్ సభ్యులు శ్రీ పంతం నానాజీ, శ్రీ ముత్తా శశిధర్, శ్రీ తుమ్మలబాబు, శ్రీ అత్తిసత్యనారాయణ, శ్రీ శెట్టిబత్తుల రాజబాబు, శ్రీ వరుపుల తమ్మయ్యబాబు, శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ పాఠంశెట్టి సూర్యచంద్ర, శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్, శ్రీ మేడ గురుదత్తప్రసాద్, శ్రీ మరెడ్డి శ్రీనివాస్ మరియు శ్రీ తాటికాయల వీరబాబు పాల్గొన్నారు.