యుగంధర్ పొన్నని పరామర్శించిన నాయకులు

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, జనసేన ఇంచార్జ్ డా.యుగంధర్ పొన్నకి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతిలోని బోత్ హాస్పిటల్ నందు సర్జరీ జరిగినది. ఈ సందర్భంగా హాస్పిటల్ లో తెలుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.బి సుధాకర్ రెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి ముని చంద్ర రెడ్డి, వెదురుకుప్పం మండలం తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్, తెలుగు దేశం పార్టీ మాజీ కో-కన్వీనర్ ఆముదాల శ్రీహరి, తిరుపతి జిల్లా బిజెపి అధికార ప్రతినిధి సతీష్, కార్వేటినగరం మండలం అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు గుర్రంకొండ భానుచంద్ర రెడ్డి, యుగంధర్ పొన్న సతీమణి శ్రవంతి రెడ్డిని ఆరోగ్య విషయాలు తెలుసుకుని పరామర్శించారు. త్వరలోనే కోలుకుని ప్రజా జీవితంలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నామని తెలియజేసారు.