మున్సిపల్ ఎన్నికలపై నిమ్మగడ్డ ఫోకస్..

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసాయి.. మొత్తం నాలుగు విడతలుగా జరిగిన ఎన్నికలు ఇవాళ్టితో ముగియగా… ఫలితాలు వెలువడుతున్నాయి.. ఇక, మున్సిపల్‌ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్… రేపు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, జిల్లా కలెక్టర్లు, డీజీపీ, జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, మున్సిపల్‌ కమిషనర్లు హాజరుకావాలని సూచించారు. రాష్ట్ర పురపాలక, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు సమీక్షకు హాజరుకానున్నారు. భేటీకి అధికారులు పూర్తి సమాచారంతో రావాలని సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.