పల్లె పల్లెకు జనసేన పార్టీ విస్తరణకు అందరూ కలిసి పనిచేద్దాం
*మండల అధ్యక్షురాలు ప్రమీలా ఒరుగంటి
మర్రిపాడుమండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాబోయే జనసేన_పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్లె పల్లెకు జనసేన సిమెంటు కార్యక్రమంలో భాగంగా మర్రిపాడుమండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీలా చేతుల మీదుగా రెండు జనసేన పార్టీ సిమెంటు బెంచ్ లు ప్రారంభించడం జరిగింది. పడమటి నాయుడుపల్లి గ్రామంలో గంటా అంజి అధ్యక్షతన చుంచులూరు గ్రామంలో చీలపోగు అశోక్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిన్నా జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి వనం పవన్ మండల ఉపాధ్యక్షుడు ఉదయ్ రామిరెడ్డి, ప్రశాంత్ కుమార్ రెడ్డి, పెంచలరావు, శిల్పం మనోజ్ ప్రకాష్ బగాది గంగయ్య, ఈరుపోతు మణికంట కుంటా ప్రసాద్ జనసైనికులు పాల్గొని విజయవంతం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-03-at-4.50.25-PM-1-1024x469.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-03-at-4.50.25-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-03-at-4.50.24-PM-1024x469.jpeg)