రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుదాం

  • అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్న జగన్ రెడ్డి
  • ప్రజల స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వానికి మూలం రాజ్యాంగం
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని స్థానిక జిల్లాపరిషత్ దగ్గరగల రాజ్యాంగ నిర్మాత న్యాయ కోవిదులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి రాజ్యాంగ నిర్మాణానికి ఆయన చేసిన సేవలను జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత స్మరించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం మన రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాలరాస్తు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తు ప్రజల, ప్రతిపక్ష పార్టీల స్వేచ్చా, స్వాతంత్రాలకు భంగం కలిగిస్తుందని రాబోయే కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు జనసేన నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.