వైసీపీ భూతాన్ని భూస్థాపితం చేద్దాం: టిడిపి, జనసేన

  • తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ ఎమ్ డి ఫిరోజ్ మరియు జనసేన నాయకులు సుందర్, అధ్వర్యంలో రోడ్లపై నిరసన
  • దాచుకో దోచుకో నినాదంతో నంద్యాల ఎమ్మెల్యే పని చేస్తున్నాడు

నంద్యాల: టిడిపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో” గుంతల ఆంధ్ర ప్రదేశ్ కు దారేది” అనే కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్ లో రోడ్లపై టిడిపి ప్రధాన కార్యదర్శి ఎన్ ఎమ్ డి ఫిరోజ్ అధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్ లో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు నిరసన ర్యాలీ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టి పర్మినెంట్ రోడ్డు కూడా వేయలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన కనీసం రోడ్లు మరమ్మత్తులు చేయలేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రోడ్లను పూర్తిగా విస్మయం చేశారని అన్నారు. ఐదేళ్లు ఎమ్మెల్యే అర్హత ఉండి కూడా కనీసం నందమూరి నగర్ రోడ్డుకి ఒక తట్టం మట్టి కూడా వేయలేదని ఆగ్రహించారు. ఎప్పుడో టిడిపి హయాంలో వేసిన రోడ్లను కనీసం గుంత పడ్డ రోడ్లు మట్టి కూడా వేయలేని దుస్థితిలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని అన్నారు. దాచుకో దోచుకో అన్న రీతిలోనే ఎమ్మెల్యే శిల్పా రవి వ్యవహరించారని చెప్పారు. చినుకు పడితే ప్రయాణం కష్టతరంగా ఉన్న ఈ రోడ్లో వర్షాకాలంలో ఈ రోడ్డు ఎమ్మెల్యేగా కనిపించట్లేదా అంటే ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన నాయుకులు సుందర్ రోడ్ లో గుంతలను చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.