మార్చ్ 14న జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం సభను విజయవంతం చేయాలని లక్ష్యంగా, దిశా నిర్దేశం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మరియు ముదినేపల్లి మండలాల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో సెంట్రల్ ఆంధ్ర జోన్ కో-కన్వీనర్ నల్లగోపుల చలపతి, బోయిన రాజేష్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు తదితరులు హాజరై పిఠాపురం సభ విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Share this content:
Post Comment