*ఛలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించిన జనసేన పార్టీ నాయకులు
*జనసేనపార్టీ ఆవిర్భావం నుండి అభివృద్ధి వరకు తోడు ఉన్న ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొనాలి అని పిలుపునిచ్చిన పార్వతీపురం జనసేనపార్టీ నాయకులు చందక అనీల్
పార్వతీపురం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు చందక అనీల్ అధ్యక్షతన ముఖ్య నాయకులు సమావేశం అయ్యారు. మార్చి 14న పిఠాపురం చిత్రాడలో జరగనున్న జనసేన 12వ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని, జనసేనపార్టీ ఆవిర్భావం నుండి అభివృద్ధి వరకు తోడు ఉన్న ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చెయ్యాలని పార్టీ నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు అందరూ హాజరై కలిసికట్టుగా పండగ జరుపుకుందాం అని పార్వతీపురం జనసేనపార్టీ నాయకులు అన్నారు. అనంతరం ఛలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ వారియొక్క అభిప్రాయాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం జనసేనపార్టీ సీనియర్ నాయకులు చందక అనీల్, నెయ్యగాపుల సురేష్, సిరిపురపు గౌరీ, భమిడిపాటి చైతన్య, రెడ్డి నాగరాజు, గునాన నరేష్, బంటు శిరీష్, చింతాడ ముఖేష్, అన్నాబత్తుల దుర్గ, నెయ్యిగాపుల సంతోష్, వహబ్, సంబాణ రమేష్, కోరాడ మౌళి, పోట్నూరు రేవంత్, గేదెల వంశీ, పతివాడ వంశీ, వీరపిండి గణేష్, సంబన కుర్మరావు, కునుకు రమేష్, బూర్లి కిరణ్, రెడ్డి కామేష్ తదితరులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment