కొణిదెల నాగబాబు అనంతపురం జిల్లా పర్యటనను విజయవంతం చేద్దాం: బాల్యం రాజేష్

అనంతపురం: కొణిదెల నాగబాబు అనంతపురం జిల్లా పర్యటన నేపధ్యంలో సమావేశమైన అనంతపురం జనసేన నాయకులు కొణిదెల నాగబాబు పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బాల్యం రాజేష్ మాట్లాడుతూ పీఏసీ సభ్యులు కొణిదల నాగబాబు 21వ తేదీ సాయంత్రం 4 గంటలకు గుత్తి టోల్గేట్ దగ్గర మరియు పాము రాయి గ్రామం వద్ద ఘనంగా స్వాగతించి అనంతపురం కి భారీ ఎత్తున వాహనాలలో ర్యాలీగా రావటం జరుగుతుంది.. 22వ తేదీ ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ వీరమహిళలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేయడం జరుగుతుంది.. మధ్యాహ్నం 12 గంటలకి నియోజకవర్గ ఇన్చార్జిలు జిల్లా కమిటీ సభ్యులు మండల అధ్యక్షులు మండల కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. ఈ సమావేశాలలో నాయకులకు రాబోయే ఎన్నికలకు ఎలా సంసిద్ధం అవ్వాలో నాగబాబు గారు వివరించడం జరుగుతుంది. ఈ సమావేశం లోనే వివిధ కుల సంఘాలు నాయకులు నాగబాబు గారిని కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరుగుతుంది.. శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొంటారు.. అనంతరం ధర్మవరంలో పర్యటించి బెంగళూరు విమానాశ్రయం కి వెళ్లడం జరుగుతుంది.. అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టి.సి వరుణ్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆదేశాల ప్రకారం 22వ తేదీ ఉదయం 9:00 గంటలకు కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అనంతపురం రోడ్డు అక్కమ్మ గార్ల గుడి దగ్గర నుంచి అందరూ కలిసి పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు ఆహ్వానితులే అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుతున్నామని తెలియజేసారు . ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ జనసేన వీర మహిళా షేక్ తార, వంశీకృష్ణ, జాకీర్, మహేష్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.